తూర్పుగోదావరిః ఈనెల 21న కాకినాడలో యువభేరి సదస్సు జరగనుంది. ఈకార్యక్రమానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ యువభేరీ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. <br/>ఇదివరకే తిరుపతి, వైజాగ్ లలో యువభేరి సదస్సులు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థుల కోరిక మేరకు వైఎస్ జగన్ ఆకార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేకహోదా గురించి యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరినీ మేలుకొల్పారు. <br/>ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరుపతి, వైజాగ్ యువభేరి సభలను విజయవంతంగా నిర్వహించామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. అదే స్థాయిలో మూడవ యువభేరి నిర్వహిద్దామని పార్టీ నేతలతో అన్నారు. <br/>