ఇది ‘ఈవీఎం’ల ప్రభుత్వం

 వైయ‌స్ఆర్‌సీపీ ఒంగోలు పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ప్రకాశం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, ఈవీఎంల ప్రభుత్వమని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.  సోమ‌వారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీచేస్తానని, జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు.

వైయ‌స్‌ జగన్‌ సీఎంగా ఉంటే ఇప్పటికే ఇంటికి యాభై వేలు వచ్చేవి: మాజీ మంత్రి కారుమూరి

  • రాష్ట్రంలో ప్రజా కంటక పాలన జరుగుతుంది... ఎమ్మెల్యే లు ప్రజలలోకి రావడానికి భయపడుతున్నారు
  • ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలనను మరచిపోయి కక్ష సాధింపుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
  • ఎన్ని కష్టాలు వచ్చినా.. ఇచ్చిన మాట నిలుపుకొన్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌
  • ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఎన్ని సార్లు అయినా మోసం చేసే ఏకైక సీఎం చంద్రబాబు
  • వైయ‌స్‌ జగన్ అధికారంలో ఉంటే  ఈ ఆరునెలల్లో ఇంటికి యాబైవేల రూపాయలు వచ్చేవి

నేను ఎప్పుడూ వైఎస్‌ జగన్‌ వెంబడే: బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

  • ఎంపిటిసి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాడిని  కార్యకర్తల కష్టాలు తెలుసు
  • నాకు రాజకియ బిక్ష పెట్టింది దివంగతనేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి
  • నేను నా కుటుంబం ఎప్పటికీ వైయ‌స్‌ జగన్  వెంబడే
  • ప్రజలను వంచించి అక్రమ కేసులు పెడుతున్న పార్టీ పై పోరాటం చేద్దాం
  • అతి తక్కువ మెజారిటితో  గిద్దలూరు సీటును కోల్పోయాం
  • వైయ‌స్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది
Back to Top