సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నాం

పదవులు పొందినవారు యాక్టివ్‌గా ఉండాలి.. 

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పార్టీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ సూచన

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థ‌లు, ఎమ్మెల్యే కోటా, గ‌వ‌ర్న‌ర్ కోటాకు సంబంధించి పార్టీ తరఫున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశామని, అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని, మిగిలిన నలుగురిలో ఒక్కో సామాజిక వర్గానికి చెందినవారికి అవకాశం కల్పించామని చెప్పారు. పదవులు పొందినవారు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. అవినీతికి చోటులేకుండా, వివక్షకు తావులేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియజేయాలన్నారు. 

సీఎం వైయస్‌.జగన్ ఏమన్నారంటే...

  • గతంలో ఎప్పుడూ చూడనంతగా, జరగనంతగా సామాజిక న్యాయం అన్నది దేవుడి దయతో మన పార్టీలో మనం చేయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే గొప్ప పరిస్థితుల్లోకి వచ్చాం.
  • ఇవాళ చాలా సుదీర్ఘంగా 18 మందిని ఫైనలైజ్‌ చేస్తే వారిలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు కాగా.. 4 మాత్రమే ఇతరులు. ఇంత గొప్పగా సామాజిక న్యాయం ఎప్పుడూ జరగలేదు. 
  • గతంలో     ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయాన్ని చేస్తున్నాం. దేవుడి దయతో మన పార్టీలో మనం సామాజిక న్యాయాన్ని చేయగలుగుతున్నాం. ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఎమ్మెల్సీ పదవులకు 18 మంది పేర్లను ఖరారు చేశాం. వీరిలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  సంబంధించిన వారే ఉన్నారు. 
  • మిగిలిన సామాజిక వర్గాల వారికి 4 సీట్లు ఇచ్చా. ఇందులో కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కటి ఇచ్చాం. మనం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలి, ప్రతి నియోజకవర్గంలో చెప్పాలి.
  • రాజకీయాల్లో ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదు. పారదర్శకంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకు లంచాలకు తావులేకుండా పథకాలు అందిస్తున్నాం.
  • విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈరోజు మనం చేసిన సామాజిక న్యాయం మరో ఎత్తు.
  • పదవులు తీసుకున్న వారు పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వారు ఒక్కటై లేనిపోని విషప్రచారం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా  అంతే ధీటుగా యాక్టివ్‌గా పనిచేయడం ద్వారా మన వాణిని వినిపించాలి. 
  • 13–14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్నవారు పార్టీకోసం ఏం చేయగలుగుతామో.. అన్న ఆలోచనతో అడుగులు వేయాలి: నేను చేయాల్సింది నేను చేశాను. మీకు ఇవ్వాల్సిన పదవులు ఇచ్చాను. మీ దగ్గర నుంచి పార్టీకి ఏ రకంగా మంచి చేయగలుగుతారు, ఏ రకంగా మంచి చేయాల్సిన బాధ్యత మీమీద ఉందన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ తరపు నుంచి నేను కోరుతున్నాను. మరింత ఉత్సాహంగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను.  పదవులు పొందుతున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాంకాక్షలు తెలియజేస్తున్నాను. 
  • ఈ పదవులు ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్న పదవులు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. అందర్నీ సంతృప్తి పరచలేం. కొద్దో గొప్పో కొరత ఉంటుంది. వీరందరికీ కూడా చెప్పే రీతిలో చెప్పుకుంటూ, వారి కన్విన్స్‌ చేసుకుంటూ వెళ్లాలి. 
  • దేవుడి దయ వల్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పార్టీని స్ధాపించాం. ప్రజల పక్షాన నిలబడుతూ రాజకీయాలు చేశాం. అధికారంలోకి వచ్చాం. దేవుడి దయవల్ల మంచి పరిపాలనకూడా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175  స్ధానాలు వై నాట్‌ అన్నరీతిలో అడుగులు ముందుకు వేసే పరిస్థితుల్లో పరిపాలన కొనసాగుతోంది. 
  • దేవుడు ఆశీర్వదిస్తే గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే.. అత్యధికంగా మెజార్టీ స్ధానాలు సాధిస్తాం. ఇంకా ఎక్కుమందికి రాబోయే రోజుల్లో ఎక్కువ అవకాశాలు వస్తాయి.  చంద్రబాబు అరకొరా పదువులు ఇచ్చి.. బీసీలకు అన్నీ చేసేశాం అని ప్రచారం చేసుకున్న సందర్భాలు మనం చూశాం.
  • ఈసారి మనం వడ్డీలు, వడ్డెరలకు అనే కులాలకు ఇచ్చాం. ఇంకా రజకులు, నాయీ బ్రాహ్మణులు ఇలా ఇంకా మిగిలిన కులాలకు తదుపరి దఫాలో తప్పకుండా ఇస్తామని భరోసా ఇస్తున్నాం. అందరికీ అభినందనలు.
Back to Top