అన్న క్యాంటీన్‌లో పెద్ద కుంభకోణం జరిగింది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

 

విజయవాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి టీడీపీ ఓర్చు కోలేకపోతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్‌మార్నింగ్‌ విజయవాడ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం కండ్రిక 59వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్డు మార్గాలు, వీధి దీపాలు, పార్కు అభివృద్ధి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేద వాడికైనా ఇల్లు ఇవ్వలేదన్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో 35 వేల మంది పేదలను అర్హులుగా గుర్తించామని, ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ పంపిణీ చేస్తామన్నారు. మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నారు. జూన్‌ 1 నుంచి ‘జగనన్న కిట్‌’ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అన్న క్యాంటీన్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని..టీడీపీ చేసిన అవినీతి మొత్తం త్వరలోనే బయటకు వస్తుందన్నారు.

Back to Top