వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నామినేషన్లపై చంద్రబాబు దుష్ప్రచారం
14 Mar 2020 1:08 PM
అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు
నెల్లూరు: నామినేషన్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల నామినేషన్లను అడ్డుకుంటే వేలాది మంది నామినేషన్లు ఎలా వేశారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో వైయస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారు. అప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?.గతంలో నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కలెక్టర్పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ దాడి చేస్తే దిక్కులేదు. అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ధైర్యముంటే సోమిరెడ్డి బహిరంగ చర్చకు రావాలి. నా తప్పు ఉంటే రాజీనామాకు సిద్ధంగా ఉన్నాని గోవర్ధన్రెడ్డి సవాలు విసిరారు.