అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకోవాలి

దెబ్బ‌తిన్న పంటలను పరిశీలించిన పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి 

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా:  అకాల వ‌ర్షాల కార‌ణంగా రైతుల‌కు భారీ న‌ష్టం జ‌రిగింద‌ని,   తక్షణమే కూటమి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి డిమాండ్ చేశారు.  పార్వతీపురం  మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బ‌తిన్న‌ మొక్కజొన్న, ఇతర పంటలను పాలకొండ  మాజీ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి గురువారం పరిశీలించారు.  మండలంలోని కొసలికి గ్రామానికి చెందిన రైతులు నైగపుల చంద్రునాయుడు, మజ్జి శ్రీనివాసరావు, చెంగల రామారావు, అలాగే కీసర గ్రామంకు చెందిన రైతులు కొరికాన నరసింహమూర్తి, ఎరుకమజ్జి సురేష్, ఎరుకమజ్జి వైకుంఠరావులతో పాటు ఘనసర గ్రామంకు చెందిన పలువురి రైతుల మొక్కజొన్న పంటలతో పాటు ఇతర పంటలను పరిశీలించి, రైతులతో కళావతి మాట్లాడారు.  ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. ఈదురు గాలులుతో అకాల వర్షాలు మండలంలోని కొసలి, కీసర, ఘనసరతో పాటు మండలంలోని పలు గ్రామాల అన్నదాతలను నిలువునా ముంచాయని, అన్నదాతల చేతికందిన పంటలను నేలపాలు చేశాయని అన్నారు. పంటల సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు వరుణుడి పాలయ్యాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  ఈదురు గాలులుతో పాటు అకాల వర్షాలుతో రైతుల పంటలకు అపార నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కళావతి మాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో  భామిని మండల ఎంపీపీ తోట సింహాచలం, వైస్ ఎంపీపీ -1 బోనగడ్డ ధర్మారావు, జడ్పీటీసీ ప్రతినిధి బొడ్డేపల్లి ప్రసాదరావు, కొసలి సర్పంచ్, వైస్ ఎంపీపీ - 2 ప్రతినిధి మజ్జి మోహనరావు, మండల వైయఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తకోట ఆంజనేయులు, గెల్లంకి రమేష్, కాగితాపల్లి కృష్ణారావు, గేదెల మోహనరావు, ఘనసర సర్పంచ్ ప్రతినిధి కిల్లారి ఫాల్గుణరావు, స్థానిక గ్రామాల రైతులు ఉన్నారు.

Back to Top