ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవడం క‌రెక్ట్ కాదు

మాజీ మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పల్నాడు పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధించ‌డం ప‌ట్ల మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవ‌డం క‌రెక్ట్ కాదంటూ ఆమె త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.  

ఎక్స్ వేదిక‌గా ఆర్కే రోజా..
`మీ ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా చంద్ర‌బాబు గారూ?  మీ పార్టీ కార్య‌ర్త‌లు చ‌నిపోయిన‌ప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌లేదా? ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌డం ఏ మాత్రం క‌రెక్టు కాదు చంద్ర‌బాబు గారూ..`అంటూ రోజా ట్వీట్ చేశారు.

Back to Top