రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సీఎం వైయస్ జగన్ను కలిసిన క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు
28 Sep 2021 6:28 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ను విఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుధీర్ఘంగా చర్చ, పరస్పరం ఆలోచనలు పంచుకున్నామని డాక్టర్ నోరి మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సకోసం ఆస్పత్రులు పెట్టాలని, అందులో ఒక దాన్ని అత్యాధునికంగా ఏర్పాటచేయాలని సీఎం సంకల్పించినట్టు డాక్టర్ నోరి వెల్లడించారు.
వివిధ మెడికల్కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను దీనికింద తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళికగా సమావేశం తర్వాత వెల్లడించిన డాక్టర్ నోరి. క్యాన్సర్ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలను తీసుకురావాలన్నది ముఖ్యమంత్రిగారి ఉద్దేశమని డాక్టర్ నోరి తెలిపారు. క్యాన్సర్చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరంలేకుండా రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా చూడాలన్నది ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగిందని డాక్టర్ నోరి తెలిపారు. రాష్ట్రానికి తగిన సహాయసహకారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనికి ముఖ్యమంత్రిగారు సంతోషించారని డాక్టర్ నోరి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సా విధానంలో గొప్ప అడుగు ముఖ్యమంత్రిగారి సమావేశం ద్వారా ఏర్పడిందన్నారు. సీఎంగారు ఆరోగ్యరంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయని చెప్పారు. మెడికల్ కాలేజీలను, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం అన్నది నాకు చాలా ఆనందాన్నిచ్చిందని, చిన్న గ్రామంలో క్యాన్సర్ రోగి ఉన్నా.. చికిత్స కోసం పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రిగారి ఆలోచన అని తెలిపారు. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని కోరిన ముఖ్యమంత్రి. ఈమేరకు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం