న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వశాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలను పూర్తి చేసింది. వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పలువురు సలహాసంఘాల్లో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ అవకాశం దక్కించుకున్న వారిలో సీనియర్ ఎంపీలు, తొలిసారిగా ఎంపీ అవకాశం దక్కించుకున్న వారు కూడా ఉండటం విశేషం. వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వివరాలివే... కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ - మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ - మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ - వంగా గీత పశువు మత్స్యశాఖ - శ్రీ కృష్ణ దేవరాయలు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ - జి మాధవి విద్యుత్ శాఖ - రఘురామకృష్ణంరాజు జలశక్తి శాఖ - బ్రహ్మానందరెడ్డి గృహ పట్టణ వ్యవహారాల శాఖ- సత్యనారాయణ అడవులు పర్యావరణం - కోటగిరి శ్రీధర్ వ్యవసాయ రైతు సంక్షేమం - బెల్లాన చంద్రశేఖర్ భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు - మార్గాన్ని భరత్ రవాణా జాతీయ రహదారులు - డాక్టర్ సంజీవ్ కుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ - చింత అనురాధ పర్యాటక సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప హోం శాఖ - గోరంట్ల మాధవ్ ఉక్కు శాఖ - నందిగామ సురేష్ షిప్పింగ్ - తలారి రంగయ్య విదేశాంగ శాఖ - సత్యవతి రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయసాయిరెడ్డి విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి Read Also: మనసున్న మారాజు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి