కాసేప‌ట్లో కేబినెట్ స‌మావేశం ప్రారంభం

స‌చివాల‌యం: కాసేప‌ట్లో ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రి మండ‌లి భేటీ కానుంది. నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డు ప్రతిపాదనలకు, రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిమండ‌లి ఆమోద ముద్ర వేయనుంది. 

Back to Top