100 మంది జనసేన నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

కులతత్వ, మతతత్వ పార్టీలు ఒక్కటయ్యాయి

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్ల‌మెంట్ అభ్య‌ర్థి విజయసాయిరెడ్డి

 నెల్లూరు: వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరారు. జనసేన పార్టీ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ నేతృత్వంలో ఆదివారం 100 మంది ఆ పార్టీ కార్యకర్తలకు  వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో కండువా కప్పి విజ‌య‌సాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.   మా పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. టిడిపికి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు. నెల్లూరు పార్లమెంటుతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వైయ‌స్ఆర్‌సీపీ  కైవసం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ, మతతత్వ పార్టీలో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు.

నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు.. అందుకే వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడ్ని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నార‌ని దుయ్యబట్టారు.

టీడీపీ నేతలు వీధి రౌడీలు, చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది. చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీ. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతలు దొరికితే.. వైఎస్సార్‌సీపీపైకి నెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లకు మించి రావు. సీబీఐ విచారణలో టీడీపీ నేతల బండారం బయటపడటం ఖాయం. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. బ్రెజిల్ అధ్యక్షునికి అభినందనలతో ట్విట్ పెడితే.. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Back to Top