మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్

ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

చిత్తూరు: అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారని.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. అందుకే ప్రజల కష్టాలను చూసి చలించిపోయారని.. ఎన్నడూలేని విధంగా రూ.కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారని చెప్పారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ .. విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ విషాదం అందరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని చూసి అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం తక్షణమే విశాఖకు చేరుకుని బాధితులను పరామర్శించి ధైర్యం నింపారని తెలిపారు. 

  సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..
టీడీపీ నేతలు దీనిపై కూడా చీప్‌గా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌ ఈ ఘటనపై హైపవర్‌ కమిటీతో విచారణకు ఆదేశించారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా పోలీసు కేసు నమోదయ్యిందన్నారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని రోజా నిప్పులు చెరిగారు. 

Back to Top