తాడేపల్లి: అభిమానుల పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టీం ఐపీఎల్ కప్ను సొంతం చేసుకున్న నేపథ్యంలో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. చరిత్ర సృష్టించిన ఆర్సీబీ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆ జట్టు ట్రోఫీని ఎత్తిన ఫొటోతో తన సందేశం ఉంచారు.