‘పొలంబడి’ ప్రతిష్టాత్మకం

అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి
 

తాడేపల్లి: పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. అగ్రికల్చర్‌ మిషన్‌ సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ మరో నెల రోజుల గడుపు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసాతో 43 లక్షల మంది రైతులకు సాయం అందించామని చెప్పారు. కౌలు రైతుల విషయంలో భూరికార్డుల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. పత్తికి సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. వేరుశనగకు కూడా త్వరలో సీసీఐ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. బయో ప్రొడక్ట్స్‌ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.

 

Read Also: వైయస్‌ జగన్‌ పాలన ఓ చరిత్ర

Back to Top