బాబుకు ఏదైనా జరిగితే భువనేశ్వరి, లోకేష్‌లదే బాధ్యత

డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌

పశ్చిమగోదావరి: చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి భువనేశ్వరి, లోకేష్‌లదే బాధ్యత అన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ వ‌ద్ద జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జరిగినట్లే  జరిగే అవకాశం లేకపోలేదన్నారు. బాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉందన్నారు. ఆనాడు తన కన్నతండ్రి ఎన్టీఆర్‌ను కట్టుకున్న భర్త చంద్రబాబే వెన్నుపోటు పొడిచినా, తండ్రిని అధికారంలో నుంచి దించేసి చివరకు ఆయన చావుకు కారణమైన కానీ కూతురు భువనేశ్వరి స్పందించలేదని గుర్తుచేశారు.

Back to Top