భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
‘యాస్ తుపాన్’ ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాం
24 May 2021 12:35 PM
వీడియో కాన్ఫరెన్స్లో కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: యాస్ తుపాన్ కదలికలను పరిశీలిస్తే.. ఏపీపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాలున్నాయని, పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకుసాగుతామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తుపాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. యాస్ తుపాన్ హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. యాస్ తుపాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.