బాబుది నయవంచక పాలన

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతీ గడపలో వైయస్సార్సీపీ శ్రేణులను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసపూరిత పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ పై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ సమస్యలను వైయస్సార్సీపీ శ్రేణులకు చెప్పుకొని విలపిస్తున్నారు. అధైర్యపడొద్దని, వైయస్ జగన్ సీఎం అయితే కష్టాలన్నీ తీరిపోతాయని వైయస్సార్సీపీ నేతలు వారికి భరోసా కల్పిస్తున్నారు. 

గడప గడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా....వైయస్సార్సీపీ సీనియర్ నేత, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామంలో గడపగడపలో పర్యటించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని, వైయస్ జగన్ ను సీఎం చేసుకొని జీవితాలను బాగుచేసుకుందామని పార్థసారథి ప్రజలకు పిలుపునిచ్చారు. 

విశాఖ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త థైనాల విజయకుమార్ 14 వార్డ్ లో గడపగడపలో పర్యటించారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ విజయప్రసాద్, & 47 వ వార్డు ప్రెసిడెంట్ పీవీ సురేష్, తదితర నేతలు హిమాచల్ నగర్ లో ఇంటింటికీ వెళ్లి బాబు అవినీతి, అరాచక, నయవంచక పాలనను ఎండగట్టారు. ఎన్నికల హామీలకు సంబంధించి వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను వారికి అందించి సమాధానాలు రాబట్టారు. ప్రజలు బాబు పాలనకు ఒక్క మార్కు కూడా వేయడం లేదు. 


Back to Top