‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
'స్థానికం'లో వైయస్ఆర్ కాంగ్రెస్కే గెలుపు
02 Jul 2013 5:14 PM
ఏలూరు, 2 జూలై 2013:
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని పోలవరం ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు తమ పార్టీ వైపే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై పశ్చిమ గోదావరి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బాలరాజు మాట్లాడారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో బాలరాజుతో పాటు, ఆళ్ల నాని, మద్దాల రాజేష్కుమార్, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు పాల్గొన్నారు.