శుక్రవారం నాటి పాదయాత్ర 19 కిమీ

కొందేడు:

మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం పందొమ్మది కిలోమీటర్లు నడుస్తారు. ఉదయం కొందేడు నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుంది.  చిన్న ఆదిరాల, పెద ఆదిరాల, ఎక్వాయపల్లి, 9 రేకుల(షాద్ నగర్), కాకునూరు, సుందరపూర్ క్రాస్, మీదుగా కేశంపేట చేరుతుంది. అక్కడ ఆమె బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం ఈ వివరాలను తెలిపారు.

Back to Top