కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు ఆస్తి లెక్కల్లో పొంతన లేదు
19 Apr 2014 2:46 PM
హైదరాబాద్:
చంద్రబాబు తన ఆస్తులను వెల్లడించే విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఏడు నెలల క్రితం బాబు ప్రకటించిన ఆస్తుల విలువకు, తాజాగా ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాలకు అస్సలు పొంతనే లేదని పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు 2009 ఎన్నికల అఫిడవిట్లో ఒక రకంగా, 2013 సెప్టెంబర్లో మరో రకంగా ఆస్తులు ప్రకటించారన్నారు. తాజా అఫిడవిట్లోని వివరాలు ఈ రెండింటికీ ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయని విమర్శించారు. గత ఏడాది సెప్టెంబర్లో తన ఆస్తులు రూ.42 లక్షలుగా పేర్కొన్న చంద్రబాబు తాజా అఫిడవిట్లో వాటిని రూ.10.6 కోట్లుగా పేర్కొన్నారన్నారు. ఏడు నెలల్లోనే ఆయన ఆస్తులు 24.23 రెట్లు పెరిగాయని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని నాగిరెడ్డి ప్రశ్నించారు.
2009 ఎన్నికల్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆస్తులను రూ.48.85 కోట్లుగా చూపారని, ఇపుడు రూ.166.86 కోట్లుగా వెల్లడించారని, అంటే ఆమె ఆస్తులు 241 శాతం మేరకు పెరిగాయని నాగిరెడ్డి వివరించారు. జూబ్లీహిల్సులో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు పక్కపక్కనే ఉన్న ఇంటి ప్లాట్ల విలువను కూడా మోసపూరితంగా చూపారని పేర్కొంటూ, అందుకు సంబంధించిన సర్వే ప్రతిని ప్రదర్శించారు. జూబ్లీహిల్సులో 1,123 చదరపు గజాలు గల 1,110 నెంబరు ప్లాటులో చంద్రబాబు నివాసం ఉంటున్న 17 గదుల భవంతి విలువను కేవలం రూ.23 లక్షలుగా చూపారని, దాని పక్కనే తన కుమారుడు లోకేశ్ పేరు మీద ఉన్న 1,309 నెంబర్ ప్లాటు విలువను రూ.2.36 కోట్లుగా చూపారని, ఇంతకంటే మోసం ఏముంటుందని నాగిరెడ్డి ప్రశ్నించారు.
లోకేశ్కు తన నాయనమ్మ బహుమతిగా ఇచ్చిందని చెప్పిన ఐదెకరాల పొలం తాలూకు విలువ కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. బహుమతిగా వచ్చిన ఆస్తికి విలువ ఉండదా అని ఆయన ప్రశ్నించారు. మాదాపూర్లో చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పేరు మీద ఉన్న 924 చదరపు గజాల భూమి విలువ కేవలం రూ.3.37 లక్షలుగా చూపారని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో గానీ, మున్సిపాలిటీల్లో గానీ ఇంత పెద్ద స్థలం విలువ ఇంత తక్కువగా ఉందా? అని విస్మయం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని నిత్యం ఆడిపోసుకునే ఓ పత్రికకు, మీడియాకు చంద్రబాబు ఆస్తుల విషయంలో చేస్తున్న మోసం ఏమాత్రం పట్టదని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.