రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రేపటినుంచి జగన్ ఆమరణ దీక్ష
04 Oct 2013 1:53 PM
హైదరాబాద్ 04 అక్టోబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. కేంద్ర క్యాబినెట్ తెలంగాణ ముసాయిదాను ఆమోదించినందుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. లోటస్ పాండ్ లోని తన నివాసం ఎదురుగా దీక్షకు కూర్చుంటానని ఆయన వెల్లడించారు. శుక్రవారం లోటస్ పాండ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దీక్ష నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన కనీవినీ ఎరగని రీతిలో చేశారని శ్రీ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మీ చావు మీరు చావండన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ను ఇంత దారుణంగా విభజిస్తూ ఉంటే దేశం మొత్తం చూస్తూ ఊరుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్ర రాష్ట్రమంటే అంత చులకనా అని శ్రీ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. ఈ తీరు మారాలని ఆయన అభిలషించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరన్న చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ తీరుగా రాష్ట్రాన్ని విభజిస్తే కృష్ణా ఆయకట్టులో రోజూ అనేక గొడవలు జరుగుతాయని శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం అవతలివైపున్న జిల్లాలు మాత్రమే కాదని, ఇవతలవైపు మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పదేళ్లలో హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలంటున్నారనీ, హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి 60 ఏళ్లు పట్టినప్పుడు కేవలం పదేళ్లలో మరో హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్ర ప్రాంతంలో నిర్మించగలరా అని శ్రీ జగన్ కేంద్రాన్ని నిలదీశారు.
విభజనకు వ్యతిరేకంగా తాను శనివారం నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు అన్ని పార్టీలూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేవలం మూడు పార్టీలు మాత్రమే సమైక్యాంధ్రకు పూర్తి అనుకూలంగా ఉన్నాయనీ, మిగిలిన వాళ్లు కూడా ముందుకు రావాలనీ విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల నాయకులూ వాళ్ల జెండాలు పట్టుకునే ఈ ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. ఇలాంటి తరుణంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దనీ, ఉద్యమంలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా ఆయన కోరారు. పార్టీలు, అధ్యక్షులలో నిజాయితీ ఉండాలని స్పష్టం చేశారు.
రేపు ఇదే పరిస్థితి కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా రావచ్చనీ, కేవలం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం ఇలా హృదయాలను చీల్చడం సరికాదని శ్రీ జగన్ విమర్శించారు. చదువుకున్న పిల్లలు రేపు ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలని నిలదీశారు. భావి తరాలు సర్వనాశనం కాకుండా ఉండాలంటే మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు.