గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన  

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో రూ. 21.31 కోట్లతో నూతనంగా నిర్మించనున్న గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంత‌రం మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలను భారీ గజమాలతో ఆర్టీసీ కార్మికులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎస్పీ యం.రవీంద్రనాథ్ బాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top