కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
వైయస్ జగన్తో మళ్లీ రాజన్న రాజ్యం..
17 Feb 2019 4:08 PM
వైయస్ఆర్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు..
ఏలూరు: రాష్ట్రంలో వైయస్ఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలకు కోరుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. మళ్లీ ఆ పాలన వైయస్ఆర్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా రావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు.ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జనలో ఆయన ప్రసంగించారు. వైయస్ఆర్ పాలనలో ప్రజలు ఆత్మాభిమానంతో జీవించారన్నారు. సామాజిక గౌరవాన్ని పోందేవిధంగా వైయస్ఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. కొంతకాలంగా తెలుగుదేశం పాలన చూస్తున్నామని.. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో లేని ఐదు సంవత్సరాలు...అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు చూస్తే..బీసీల్లో ఏ ఒకరినైనా రాజ్యసభకు పంపించిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ.. కేంద్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకుందని..ఒక బీసీనైనా మంత్రిని చేశారా అని ప్రశ్నించారు. బీసీ పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు.