బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
ఎన్ని అడ్డంకులు సృష్టించిన భయపడేది లేదు
25 Feb 2019 6:47 PM
టీడీపీ పాలన దుర్మార్గం
టీడీపీ అరాచకాలను ప్రజలు సహించరు
వైయస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తుందని వైయస్ఆర్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అణిచివేత చర్యలకు పాల్పడుతుందన్నారు. కమ్మపాలెంలో టీడీపీ పార్టీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వచ్చిన నాయకులు పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమయ్యారని..వారిని పోలీసులను అడ్డంపెట్టుకుని అరెస్ట్ చేయించారన్నారు. టీడీపీ అరాచకాలను ప్రజలందరూ చీదరించుకుంటున్నారన్నారు.ఈ ప్రాంతంలో చంద్రబాబు కులానికి చెందిన వారే పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నారని, దీంతో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.ప్రజలు వైయస్ఆర్సీపీ తరపున ఉన్నారని, టీడీపీ ఎన్ని అడ్డుంకులు సృష్టించిన భయపడేదిలేదన్నారు.