‘సీఎం ఆఫ్‌ ది ఇయర్‌’గా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

స్కోచ్ ప్రతిష్టాత్మ అవార్డు సొంతం చేసుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

అత్యుత్తమ పరిపాలన అంటూ ప్రశంసలు

 

అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  స్కోచ్‌ ‘సీఎం ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలు ఆయ‌న‌ను అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరొచ్చేలా చేశాయి. ఈ మేరకు స్కోచ్‌ గ్రూపు ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ..అవార్డును అంద‌జేశారు.   

ఈ ఏడాది అత్యుత్తమ పాలనను అందించిన రాష్ట్రంగా నిలిచిందని, సుపరిపాలనలో రాష్ట్రాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ అగ్రస్థానంలో నిలిపారని స్కోచ్ చైర్మ‌న్‌ ప్రశంసించారు.    

Back to Top