గవర్నర్‌తో వైయస్‌ జగన్‌ భేటీ

విజయవాడ: గవర్నర్‌ నరసింహన్‌తో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌లో ఉన్న గవర్నర్‌ను వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితం కలిశారు. రేపు ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా, వైయస్‌ జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్‌ విజయవాడకు చేరుకున్నారు. దీంతో వైయస్‌ జగన్‌ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 

Back to Top