తాడేపల్లి: జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంపై వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మిషన్ ద్వారా వాతావరణ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు సాధిస్తున్న విజయాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.