టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
నాయకుడికి, భ్రమలు కల్పించి నాటకాలాడే వారికి ఇదే తేడా
21 Jul 2019 7:08 PM
వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి
అమరావతి: అవినీతి రహిత పాలన కోసం జుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు కోటరీ వెన్నులో వణుకు మొదలైందని వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.
‘‘చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏనాడూ కౌలు రైతుల వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం వైయస్ జగన్ 15.30 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసాతో పాటు అన్ని పథకాలు వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. నాయకుడికి, భ్రమలు కల్పించి నాటకాలాడే వారికి తేడా ఇదే మరి. జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్తు పీపీఏలపై సమీక్ష వంటి నిర్ణయాలతో చంద్రబాబు, ఆయన కోటరీకి వెన్నులో వణుకు మొదలైంది. రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. కొందరు పార్టీ మారి ఎస్కేప్ రూట్ పట్టారు. ఏం చేసినా తప్పించుకోలేరు’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.