ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జైల్లో వల్లభనేని వంశీతో వైయస్ఆర్సీపీ నేతల ములాఖత్ విజయవాడ: వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni vamsi)పై చంద్రబాబు కక్షగట్టారని, ఆయనకు సంబంధం లేని కేసులో ఇరికించారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్(MLA Tatipatri Chandra Sekhar) మండిపడ్డారు. చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైందని, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. జైల్లో వల్లభనేని వంశీతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైయస్ఆర్సీపీ(ysrcp) ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదని, అతని వాంగ్మూలంలో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయిందని చెప్పారు. 10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారని తప్పుపట్టారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా ఆయనకు చంద్రబాబు ఆపాదించారని ఆక్షేపించారు. వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో ఆయన్ను ప్రథమ ముద్దాయిగా పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతి అని హెచ్చరించారు. చంద్రబాబు మీద కేసు పెట్టాలి కదా? ఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దానిని తప్పు దోవ పట్టించి... వంశీ పై కేసు పెట్టారని మండిపడ్డారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారని, 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టిందని చెప్పారు. క్వారీ ల్యాండ్ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు(Chandra Babu) మీద పెట్టాలి కదా అని ప్రశ్నించారు. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే అన్నారు. తాటికాయంత అక్షరాలతో పచ్చ మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తుందని తప్పుపట్టారు వీరందరి మాటలు బూతులు కాదా? హోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డలను అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏం అవుతారు...అని బూతులు అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా?. కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రీ వీరందరి మాటలు బూతులు కాదా? అని నిలదీశారు. జబర్దస్త్ నటులతో డిబేట్లు పెట్టి బూతులు తిట్టించారని గుర్తు చేశారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు.. వీరు మాట్లాడేవన్నీ బూతులు.. చేసే పనులన్నీ దుర్మార్గాలు అంటూ ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కొడుకులు అంటే బూతు కాదా?.. లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా..? అంటూ ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతు గల నాయకుడిగా లోకేష్(Lokesh)ను పైకి తేవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా చేస్తున్న కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నామన్నారు. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరికి పడక లోకేష్ ను పైకి తేవాలని, సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వంశీకి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. వంశీపై ఎందుకంత కక్ష.. వల్లభనేని వంశీపై రూల్స్ ప్రకారం ఒక్క కేసు కూడా లేదని, ఆయనపై ఎందుకంత కక్షగట్టారని వంశీ సతీమణి పంకజశ్రీ(Pankaja sri) ప్రశ్నించారు. జైల్లో ఆయనకు కనీసం కూర్చోటానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదన్నారు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలని ఆమె కోరారు. వంశీని మెంటల్గా డిప్రెషన్కు గురిచేయాలనుకుంటున్నారని, ఇలా చేయటం తప్పు కాదా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వంశీని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదని, అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా అని నిలదీశారు. వంశీ జైల్లో ఇబ్బందులు పడుతున్నారని పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.