అశ్విన్ ఆరాధ్యకు క‌న్నీటి వీడ్కోలు

వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయ‌కుడు వాల్మీకి లోకేష్‌ను ఓదార్చిన పార్టీ నేత‌లు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా బూత్ కన్వీనర్ వాల్మీకి లోకేష్ తనయుడు అశ్విన్ ఆరాధ్య నిన్న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. అక్ర‌మ కేసుతో చేయ‌ని నేరానికి స‌బ్‌జైల్‌లో శిక్ష అనుభ‌విస్తున్న‌ వాల్మీకి లోకేష్ బెయిల్‌పై విడుదల చేయించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు చిన్నారి అశ్విన్ ఆరాధ్య‌కు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు.  శ్రీ సత్య సాయి జిల్లా వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, హిందూపురం నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ దీపిక వేణురెడ్డి లోకేష్‌ను జైల్ నుంచి తీసుకువ‌చ్చి ఆరాధ్య మృత‌దేహానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి ధైర్యం చెర‌ప్పారు.  

కుమారుడి అకాల మ‌ర‌ణంతో కుంగిపోయిన లోకేష్‌
హిందూపురం పట్టణానికి చెందిన వాల్మీకి లోకేష్‌పై కూట‌మి నేత‌లు త‌ప్పుడు కేసు బ‌నాయించి జైల్‌కు పంపించారు.  చేయ‌ని నేరానికి శిక్ష అనుభ‌విస్తున్న లోకేష్‌కు.. త‌న కుమారుడు అశ్విన్ ఆరాధ్య విద్యుదాఘాతానికి గురి కావ‌డంతో కుంగిపోయాడు. ఆ బాధ‌ను దిగ‌మింగుకోలేక జైల్ గోడ‌ల‌కు త‌ల‌ను బాదుకోవ‌డంతో తీవ్ర‌గాయ‌మై, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ప‌డ్డారు. దీంతో హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం కుమారుడును క‌డ చూపు చూసుకొని క‌న్నీటి నివాళుల‌ర్పించారు. పార్టీ నాయ‌కులు ధైర్యం చెప్పి చిన్నారి అశ్విన్ ఆరాధ్య అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  పార్టీకి చెందిన రాష్ట్ర మహిళ విభాగ ప్రధాన కార్యదర్శి మధుమతి, జిల్లా నాయకులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి వాల్మీకి లోకేష్ ను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
 

Back to Top