తాడేపల్లి: టెన్త్ పిల్లలను రెచ్చగొట్టి ‘దేనికోసమో’ చేసిన ప్రయత్నాలు ‘ఫెయిల్’ అయ్యారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇప్పుడు గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలపై కుట్రలు చేస్తున్నారు నికృష్టపు తుప్పు, పప్పులు....పుల్లలు పెట్టడం జన్యురీత్యా వచ్చిన నక్క బుద్ధి వీళ్ళకి. తుప్పు హయాంలో APPSCని తన చెంచాలతో నింపేశాడని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అరకు ఏజెన్సీలోని డుంబ్రిగుడలాంటి మారుమూల ప్రాంతంలో జన్మించి ఇండో - నేపాల్ అంతర్జాతీయ యూత్ గేమ్స్ లో విజయదుందుభి మోగించిన మన్యం వీరులు పాలసి శ్రీను, జుర్ర పవన్ కుమార్, రాజేష్ పాల్ కు నా అభినందనలు. మూడు స్వర్ణ పతకాలు సాధించిన వీరు ఒలింపిక్స్ లోనూ పతకాలు సాధించాలని ఆశిస్తున్నా అంటూ అంతకుముందు విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.