పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది
01 Dec 2021 11:49 AM
కోతకు గురైన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవయ్య
నెల్లూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను, రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు కోతకు గురి కావడంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బుధవారం పరిశీలించారు. నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఉన్న మహాలక్ష్మి నగర్ గిరిజన కాలనీ సమీపంలో ఉన్న తుమ్మూరు చెరువుకు వర్షపు నీరు భారీగా చేరి కాలనీల్లోకి రావడంతో కిలివేటి సంజీవయ్య పరిశీలించి బాధితులతో మాట్లాడారు. మహలక్ష్మీ నగర్ కాలనీలో సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని మున్సిపల్, వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సంజీవయ్య సూచించారు.
తమ కాలనీలోని కొంత మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయని కొంతమందికి వివిధ కారణాల వల్ల రాలేదని ఎమ్మెల్యే సంజీవయ్య గారి దృష్టికి కాలనీవాసులు తీసుకురావడంతో... నాయుడుపేట ఆర్డీఓ సరోజినీ తో ఫోన్లో మాట్లాడి కాలనీలోని గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. అలాగే బాధితులకు బియ్యం అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే గిరిజనులకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలు నీట మునిగాయని, వరద ప్రభావం వల్ల కొన్ని ఇళ్ళు దెబ్బతినడం జరిగిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.