పవన్‌ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు.. మాటల్లో పొంతన లేదు 

ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
 

తూర్పు గోదావరి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని, ఆయన వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని, మాటల్లో పొంతన లేదని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకోవాలనేదే చంద్రబాబు తాపత్రయమని పేర్కొన్నారు. రాజధానిలో కృత్రిమ ఉద్యమాలు సృష్టించొద్దని సూచించారు. రాజధానిపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం చంద్రబాబు, పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. రాజధానిపై ఎందుకు రెఫరెండం పెట్టాలని ఆయన నిలదీశారు. 
 

Back to Top