ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు
 

 గుంటూరు:   ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్ర‌తినిధి అంబ‌టిరాంబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు భోగి మంటల వేడుకల్లో సందడి చేశారు. గుంటూరు జిల్లాలొని సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు.

గాంధీ  బొమ్మ సెంటర్‌లో సాంప్రదాయబద్దంగా భోగి మంటలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మహిళలలో హుషారుగా డ్యాన్స్‌ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు.  భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top