మంత్రి పదవి కంటే రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యం

మంత్రి మోపిదేవి వెంకటరమణ
 

తాడేపల్లి: మంత్రి పదవి కంటే తనకు రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే శాసన మండలి రద్దు చేశారని తెలిపారు. మంత్రి మండలిపై కూడా చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని చెప్పారు. మండలిని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకోవాలని చూశారు. ఎమ్మెల్సీలకు జీతాలిస్తామని చంద్రబాబు బతిమాలుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, ఇంగ్లీష్‌ మీడియం విద్య బిల్లులను అడ్డుకున్న మండలి వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని మోపిదేవి పేర్కొన్నారు.

Back to Top