చంద్రబాబు లాంటి వ్యక్తులు పొర్లు దండాలు పెట్టినా జగనన్న సంకల్పం ఆగదు

మంత్రి జోగి రమేష్‌

విశాఖ: పేదలకు ఇళ్ల పట్టాలు అందకూడదని ప్రతిపక్ష నేత చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా, కోర్టుకు వెళ్లినా భగవంతుడు వైయస్‌ జగన్‌ వెంట ఉన్నారు కాబట్టి ఆయన సంకల్పం ఆగదని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...మంత్రి మాటల్లోనే...చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు..ఉత్తరాంధ్ర అక్కచెల్లెమ్మల చిరకాల వాంఛ నెరవేరే రోజు ఇది. వైయస్‌ జగనన్న గూడు కల్పించిన గొప్ప రోజు ఇది. ముఖ్యమంత్రికి అభినందలు తెలుపుతున్నాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీల్లో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న మీ సంకల్పం ఎప్పుడో నెరవేరాలి. కానీ కొంత మంది దుర్మార్గులు అడ్డుపడటంతో ఆలస్యమైంది. నారా చంద్రబాబు లాంటి వ్యక్తి కోర్టుకు వెళ్లినా, పొర్లు దండాలు పెట్టినా భగవంతుడు జగనన్న వెంట ఉన్నారు కాబట్టే ప్రజలకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కాబట్టే ఈ రోజు 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. కాలనీలు కాదు..ఇవాళ ఏకంగా ఊర్లనే జగనన్న నిర్మిస్తున్నారు. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆశీస్సులతో జగనన్న సామాజిక న్యాయం చేస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎగదాలన్న మీ సంకల్పం నెరవేరిందని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు.
 

Back to Top