వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు కక్కుర్తి.. కొన్ని వ్యవస్థలకు శాపాలు
11 Jun 2022 3:41 PM
రోడ్ల బాగుకు ఉపయోగించే నిధులనూ వాడేసుకున్నాడు
రూ.2,205 కోట్లతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపిస్తున్నాం
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
విజయవాడ: దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఐదేళ్ల పాలన సాగిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. చంద్రబాబు కక్కుర్తి పనులు కొన్ని వ్యవస్థలకు శాపాలయ్యాయన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ఖర్చు చేయాల్సిన రూ.300 – 400 కోట్లను తమ సొంత అవసరాలకు చంద్రబాబు వాడుకున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు దత్తపుత్రుడు, ఎల్లోమీడియాతో అసత్య ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలనలో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులు జరుగుతున్నాయని చెప్పారు.