అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే ఏడాది ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని అక్టోబర్ నుంచి అమలు చేస్తామన్నారు. విత్తన బకాయిలు కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదని ఫైర్ అయ్యారు. ఏడాదికి రైతు, కౌలు రైతుకు రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.