అమరావతి: ప్రజావేదికలో ఈనెల 24న జరగనున్న కలెక్టర్ల కన్ఫరెన్స్ ఏర్పాట్లను మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.ప్రజా వేదిక ప్రభుత్వం నిర్మించిందని..ప్రజా వేదిక చంద్రబాబు డబ్బుతో,తాత ఆస్తులతో కట్టించింది కాదన్నారు. ప్రజావేదిక తమదని టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు.అధికారులతో టీడీపీ నేతలు వాగ్వివాదానికి దిగడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు.