టీడీపీ నేతలు రూ.400 కోట్ల దోపిడీ

మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌
 

అమ‌రావ‌తి: పోలవరం ప్రాజెక్టు కోసం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దోచేశార‌ని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ విమ‌ర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సర్వ అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఆయ‌న అన్నారు. కేంద్రం నుంచి అనుమతుల తీసుకురావడం దగ్గరి నుంచి కాలువ పనుల వరకూ దివంగత నేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడారు.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైయ‌స్ కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని స్పష్టం చేశారు.

Back to Top