కారెం శివాజీ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక 

పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైయస్‌ జగన్‌  
 

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన శుక్రవారం ఆయన పార్టీలో చేరారు. కారెం శివాజీకి సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా గత సార్వత్రిక ఎన్నకల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి భవిష్యత్తు లేదని భావించిన.. శివాజీ గురువారమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

వైయస్‌ జగన్‌ ఆశయాలకు ఆకర్శితుడినై...
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు కారెం శివాజీ పేర్కొన్నారు.  టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశానని పేర్కొన్నారు. పదవీ కాలం ఉన్నా సీఎం వైయస్‌ జగన్ ఆశయాలకు ఆకర్షితుడినై రాజీనామా చేసి  బేషరతుగా వైయస్‌ఆర్‌సీపీలో చేరినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయని చెప్పారు. ఆరు నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారని, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వారి కళ్ళలో కాంతి కనిపిస్తోందన్నారు.  నవరత్నాలు ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారన్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి మేలు చేశారని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం వల్ల అనేక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.  మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం.. లేదంటే మా పిల్లలు వెనుకబడతారని చెప్పారు.  అందుకే మేము ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని, మేమంతా సీఎం వైయస్‌ జగన్‌కు అండగా ఉంటామని కారెం శివాజీ స్పష్టం చేశారు. 

Read Also: చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషిత

Back to Top