అచ్చెన్నాయుడు ప్ర‌వ‌ర్త‌న‌పై సీఎం వైయస్‌ జగన్‌ సీరియస్‌

అమరావతి: శాస‌న‌స‌భ స్పీకర్ త‌మ్మినేని సీతారాం అధ్యక్షతన జరుగుతున్న బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. సభలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని సీఎం చెప్పారు. గవర్నర్‌ పెద్ద వయస్సు వారు.. మనం ఆయనకు గౌరవం ఇవ్వాలని అచ్చెన్నాయుడుకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 

Back to Top