కరోనా కట్టడి చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఆస్పత్రుల్లో వైద్యం, ఆక్సిజన్, బాధితులకు ఆహారం, బెడ్స్, శానిటేషన్, 104 కాల్‌ సెంటర్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్‌ వంటి తదితర అంశాలపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. సమీక్షా సమావేశం సీఎం పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top