మంచి చేశాం కాబట్టే కాలర్‌ ఎగరేసుకుని తిరుగగలుగుతున్నాం

గడప గడపకూ వర్క్‌షాపులో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: మూడేళ్లలో సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని, అందుకే ఈ రోజు కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని సీఎం చెప్పారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. దాదాపు 8 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజుల పాటు కేటాయించాలని సూచించారు. నెలలో 20రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గడపకూ కార్యక్రమం చేపట్టాలన్నారు. గడప గడపకూ కార్యక్రమంపై నెలకోసారి వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని చెప్పారు. వచ్చిన ఫీడ్‌  బ్యాక్‌పై వర్క్‌షాపులో చర్చిస్తామని తెలిపారు. మనకు ఓటు వేయనివారికి కూడా  రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని సీఎం చెప్పారు.


 

వ‌ర్క్‌షాపులోని ముఖ్యాంశాలు ఇలా..

►గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం
►దాదాపు 8 నెలలపాటు ఈకార్యక్రమం జరుగుతుంది
►ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయింపు
►నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం
►గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలి. అందుకోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తాం
►ఆ నెలరోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తాం
►ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టిసారిస్తాం
►ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుంటాం, వాటిపై చర్చిస్తాం. దీనివల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది.
►గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారం కూడా అత్యంత ముఖ్యమైనది
►ఈ ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా సాగడంపైన కూడా దృష్టిపెడుతున్నాం


►గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలి. 
►ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదు. ఎందుకంటే.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నారు
►ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. ప్రతి అక్క చెల్లి పేరుమీద లేఖ కూడా ఇస్తున్నారు
►మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం
►ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు.. ప్రజా ప్రతినిధులుగా మనకు ఏంకావాలి
►చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం
►సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం
►ఇక మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమే
►ఎవరైనా అనుకున్నామా? కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని?
►ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌ చేస్తామని? ఎందుకు జరిగింది?


►అలాగే 175కి 175 సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి
►రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి
►ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలి
►ప్రతి సచివాలయంలోనూ పొద్దుట నుంచి సాయంత్రం 6–7వరకూ గడపగడకూ నిర్వహించాలి
►ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలి
►ప్రతి నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. కార్యక్రమాన్ని నాణ్యతతో చేయడం అన్నది చాలా ముఖ్యం' అని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు.

Back to Top