నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం 

విజ‌య‌వాడ‌: విజయవాడ గుప్తా కల్యాణ మండపంలో జరిగిన ఐఏఎస్ అధికారులు కె.ప్రవీణ్ కుమార్, సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూతన వధూవరులు పృధ్వీ, లిఖిత దంపతులకు శుభాకాంక్ష‌లు తెలిపి.. ఆశీర్వ‌దించారు. క‌ల్యాణ మండ‌పం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే విడ‌ద‌ల రజినితో పాటు ప‌లువురు మ‌హిళ‌లు  రాఖీ క‌ట్టి స్వీట్లు తినిపించి.. పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Back to Top