చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న ! 

మంత్రి అంబ‌టి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని ట్వీట్  
 

గుంటూరు:  టీడీపీ స‌భ‌ల్లో అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు బ‌లి అవుతున్నాయ‌ని, ఈ ప్రమాదాలకు చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు.  గుంటూరు సభ ప్రమాదంపై అంబటి రాంబాబు ట్విట్టర్‌ వేదికగా చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌ట్టారు. ‘చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న !’.. ‘నిన్న కందుకూరులో  8 మంది మృతి. నేడు గుంటూరులో ఇప్పటికి 3 మృతి.  ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి !’ అని వ్యాఖ్యలు చేశారు. 

అలాగే మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ‘ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది, గుంటూరు పట్టణంలో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!’ అని పేర్ని నాని ఘాటుగా కా​మెంట్స్‌ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా ప్రజల ప్రాణాలు బలిఅవుతున్నాయి. టీడీపీ సభల్లో చంద్రబాబు, టీడీపీ సభ నిర్వాహకుల నిర్లక్ష్యంగా కారణంగా గడిచిన 5 రోజుల్లో 11 మంది మృతిచెందారు. కాగా, ఈ ఘటనలపై సామాన్య ప్ర‌జ‌లు సైతం సీరియస్‌ అవుతున్నారు.   

Back to Top