మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న !
02 Jan 2023 12:07 PM
మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని ట్వీట్
గుంటూరు: టీడీపీ సభల్లో అమాయక ప్రజల ప్రాణాలు బలి అవుతున్నాయని, ఈ ప్రమాదాలకు చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు సభ ప్రమాదంపై అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న !’.. ‘నిన్న కందుకూరులో 8 మంది మృతి. నేడు గుంటూరులో ఇప్పటికి 3 మృతి. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి !’ అని వ్యాఖ్యలు చేశారు.
అలాగే మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ‘ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది, గుంటూరు పట్టణంలో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!’ అని పేర్ని నాని ఘాటుగా కామెంట్స్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా ప్రజల ప్రాణాలు బలిఅవుతున్నాయి. టీడీపీ సభల్లో చంద్రబాబు, టీడీపీ సభ నిర్వాహకుల నిర్లక్ష్యంగా కారణంగా గడిచిన 5 రోజుల్లో 11 మంది మృతిచెందారు. కాగా, ఈ ఘటనలపై సామాన్య ప్రజలు సైతం సీరియస్ అవుతున్నారు.