98 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు

కీలక ఫైల్‌పై సీఎం వైయ‌స్‌ జగన్‌ సంతకం
 

 తాడేపల్లి: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్దులకు తీపికబురు అందించింది ఏపీ ప్రభుత్వం. అభ్యర్థులందరికీ న్యాయం చేసే ఫైల్ మీద సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు. ఈ మేరకు వారికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

త్వరలోనే వారికి(98 డీఎస్సీ అభ్యర్థులు) ప్రభుత్వం న్యాయం చేయనుందని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తెలిపారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న 98 డీఎస్సీ ఫైల్ పై సీఎం వైయ‌స్ జగన్‌ సంతకం చేశారు. ఇరవై ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉంది. ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. సీఎం జగన్‌ న్యాయం చేస్తారని నమ్మి వాళ్ళు విన్నవించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు సీఎం వైయ‌స్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

 గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 98, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగలేదు. 2008 డీఎస్సీ అభ్యర్థుకుల  కూడా సీఎం వైయ‌స్ జగన్‌ న్యాయం చేశారు. తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుంది. త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి...విధివిధానాలు రూపొందిస్తున్నారు.  

   వైయ‌స్ జగన్ కే ఇది సాధ్యం : ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి
ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న 1998  డీఎస్సీ ఫైల్ పై సీఎం సంతకం చేశారని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తెలిపారు. 20 ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. అభ్యర్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక్క వైయ‌స్ జగన్ కే సాధ్యమ‌ని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి అన్నారు. 

Back to Top