<strong>పూర్తిగా ప్రతిఫలం దక్కేదెప్పుడో</strong><strong>ఇప్పటికే రూ. 20 కోట్లు దాటిన ఖర్చు</strong><br/>విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా.. దాని ఫలితం ఏమిటన్నది పెద్దగా ఆలోచించరు కానీ, ప్రచారం ఏ మేరకు దక్కుతుంది అన్నది మాత్రం బాగా చూసుకొంటారు.<br/><strong>భాగస్వామ్య సదస్సు తో హడావుడి</strong>ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రచారం హడావుడి బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కార్పొరేట్ సీఎంగా లబ్ది సంపాదించుకొనేందుకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు. బహిరంగంగా పది లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేట్ సంస్థలకు అడ్డగోలుగా ఇచ్చేస్తామంటూ హామీలు గుప్పించారు. దీంతో కంపెనీ పెట్టినా పెట్టకపోయినా భూములు తీసేసుకొందామనుకొనే కంపెనీలు సైతం వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయిల మేర ఒప్పందాలు చేసుకొన్నామని కాగితపు లెక్కలు చూపించుకోవటం తప్ప జరిగిందేమీ లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.<br/><strong>ఖర్చు మాత్రం తడిసి మోపెడు</strong>ఈ వంకతో భారీగా ప్రచారం చేయించుకొందామని ఆశించిన చంద్రబాబుకి మాత్రం బాగానే గిట్టుబాటు అయింది. ఎల్లో మీడియాలో అద్బుతంగా డబ్బా కొట్టుకోగలిగారు. కానీ, ప్రజలకు మాత్రం బాగానే ఖర్చు అయింది. ప్రజల ఖజానా నుంచి తక్కువలో తక్కువ రూ. 20 కోట్లు ఖర్చు అయి ఉంటాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే రెండు నెలల్లో ఖజానానుంచి ఇతర ఖర్చుల్ని కళ్లెం వేయటానికి ఆదేశాలు జారీ అవుతాయని పిస్తోంది. వచ్చిన అతిథుల కోసం, ముఖ్యమంత్రి కి అందుబాటులో ఉండాల్సిన మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఫైవ్ స్టార్ హోటల్స్, విమానాల ఖర్చులు చూస్తే కళ్లు తిరగటం ఖాయం. <p/>