– ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వికృత రాజకీయం
– వైయస్ఆర్సీపీ నాయకుల హత్యలకు బాబు ప్రోత్సాహం
– రాజకీయంగా ఎదుర్కోలేక వరుస హత్యలు
– పథకం ప్రకారమే నారాయణరెడ్డి దారుణ హత్య
– పోలీసుల అండదండలతోనే మరణ మృదంగం
చెప్పేది శ్రీరంగ నీతులు చేసేవన్నీ దొమ్మరి పనులు అన్నట్టు తయారైంది ఏపీలో చంద్రబాబు రాజకీయం. పైకి మాత్రం తానేదో గొప్ప మానవాతావాదిలా.. అభివృద్ధి కాముకుడిలా ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు తెరవెనుక హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. బౌద్ధ మతం ప్రేరణతో అమరావతిలో శాంతి సౌభాగ్యాలను వెల్లివిరిసేలా చూస్తానని వైయస్ఆర్సీపీ నాయకుల హత్యలను ప్రోత్సహిస్తున్నాడు. చంద్రబాబు సూచనలతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు రానున్న ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులను లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. క్రూరమృగాలకంటే హీనంగా మారి మనుషులను చంపేస్థాయికి దిగజారారు పచ్చరౌడీలు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా పార్టీ నాయకులు బలపడేందుకు వీలుగా ఇసుమ మాఫియాను ప్రోత్సహిస్తున్నాడు చంద్రబాబు. ఇదెంత దారుణంగా తయారైందంటే ఇసుకను మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తహసీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టి ఈడ్చి కొట్టడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేను మందలించాల్సిన చంద్రబాబు మాత్రం తహసీల్దార్ను పిలిచి మందలించడం అధికారులపై అదీ మహిళలపై ఆయనకున్న చిన్నచూపును తెలియేస్తుంది.
హత్యలకు బాబు ఏం సమాధానం చెబుతారు..
టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఇప్పటికే 13 మంది వైయస్ఆర్సీపీ నాయకులను పొట్టన బెట్టుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణరెడ్డిని పొట్టనబెట్టుకున్నారు. నారాయణరెడ్డి హత్య జరిగిన విధానాన్ని పరిశీలిస్తే పక్కా స్కెచ్తో చేసిన హత్యగా తెలుస్తుంది. కేఈ సోదరుల అండదండలతోనే నారాయణరెడ్డిని ప్లాన్ ప్రకారం అతి కిరాతకంగా చంపివేశారని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక పోలీసుల సహకారం ఉందనే అనుమానాలను నారాయణరెడ్డి కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. దివంగత నారాయణరెడ్డి తన గన్లైసెన్స్ రెన్యువల్ కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా వాయిదా వేస్తూ వచ్చారు తప్ప రెన్యువల్ చేయలేదు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా వారి నుంచి స్పందన లేదు. అంటే పథకం ప్రకారమే ఆయన్ను ఒంటరిగా, నిరాయుధుడిగా చేసే సమయం చూసి చంపాలనేది టీడీపీ నాయకుల కుట్ర. హత్య జరిగిన తీరును గమనిస్తే పథకం ప్రకారం దాడి చేసి చంపారనేది అందరికీ తెలిసే విషయమే. ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డం పెట్టి బాంబులతో దాడి చేసి వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారంటేనే హత్యలోని తీవ్రత తెలుస్తుంది. నారాయణరెడ్డిని చంపిన అనంతరం కూడా వేటకొడవళ్లతో ముఖాన్ని చెక్కేశారంటే ఎంత కసిగా పచ్చరౌడీలు ఈ కిరాతక చర్యలు ఒడిగట్టారో అర్థమవుతోంది.
కేఈ సోదరుల పనే..?
నారాయణ రెడ్డి హత్యతో రాయలసీమలో చల్లారిపోయాయనుకున్న ఫ్యాక్షన రాజకీయాలు మరోసారి నిద్రలేచాయి. తన భర్తను చంపింది కేఈ సోదరుల పనేనని ఇప్పటికే నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని చెప్పిన కేఈ తమ కుమారుడిని రానున్న ఎన్నికల్లో పత్తికొండ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే నియోజకవర్గంలో నారాయణరెడ్డి చురుగ్గా ఉండడంతో ఓటమి తప్పదనే భయంతో హత్యకు కుట్ర చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతవరకైనా తెగిస్తామని టీడీపీ నాయకులు ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఉదయం 9.30కు హత్య జరిగితే మధ్యాహ్నం 2.30 గంటల వరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లలేదంటేనే తెలుస్తుంది ఈ హత్యకు పోలీసుల సహకారం పుష్కళంగా ఉందని. హత్య జరిగిన స్థలంలో ఆధారాలను లేకుండా చేసే కుట్రలో భాగంగానే వారీ పని చేశారనుకోక తప్పదు.
అక్కడ అక్షరాభ్యాసం.. ఇక్కడ హత్యారాజకీయం
చంద్రబాబు ఓ పక్క మనుమడితో అక్షరాభ్యాసం చేయిస్తూనే మరో పక్క పచ్చరౌడీలకు కత్తులు ఇచ్చి హత్యలకు పంపుతున్నారు. అక్కడ మనమడితో అ అంటే అమ్మ.. అమరావతి, ఆంధ్రప్రదేశ్, ఆదాయం అని రాయిస్తూ...ఇక్కడ అ అంటే అవినీతి.. అరాచకం అని పచ్చతమ్ముళ్లకు నూరిపోస్తున్నారు. ఇసుక మాఫియాలు, భూ దోపిడీలు.. ప్రత్యర్థి పార్టీ నాయకుల హత్యలను ప్రేరేపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో మారణఖాండ సృష్టిస్తుందనడానికి వైయస్సార్సీపీ నాయకుల హత్యలే అందుకు ఉదాహరణ.
ఎటు చూసినా హత్యలు – హాహాకారాలు.
తెలుగుదేశం హయాంలో మూడేళ్లలో జరిగిన రాజకీయ హత్యలు
(2015 ఏప్రిల్ 29) అనంతపురం : రాప్తాడులో వైయస్ఆర్సీపీ నేత ప్రసాద్ రెడ్డి (ఎమ్మార్వో) కార్యాలయంలో హత్య
(2015 అక్టొబర్ 14)ఆళ్లగడ్డ : చింతకుంటలో వైయస్ఆర్సీపీ నాయకుడు రాఘవ రెడ్డి హత్య.
(2015 మే 15) కర్నూలు :వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ వసంత రావు హత్య.
(2014 ఏప్రిల్ 14) గుంటూరు : తెనాలిలో వైయస్ఆర్సీపీ యూత్ వింగ్ లీడర్ మెడిశెట్టి క్రిష్ణ హత్య
(2014 సెప్టెంబర్ 11) గుంటూరు : చినగార్ల పాడులో వైయస్ఆర్సీపీ కార్యకర్త గొవింద రెడ్డి హత్య
(2015 మార్చ్ 31) అనంతపురం : కిష్టిపాడులో వైయస్ఆర్సీపీ నేత (సహకార బ్యాంక్ ప్రెసిడెంట్) విజయ భాస్కర్ రెడ్డి హత్య
(2014 డిసెంబర్ 30) నెల్లూర్: వైయస్ఆర్సీపీ నేత అల్లం నరేంద్ర హత్య
(2014 నవంబర్ 27) కర్నూలు : పలుకూరులో వైయస్ఆర్సీపీ నేత ప్రభాకర్ నాయుడు హత్య
(2014 అక్టొబర్ 28) విజయవాడ : నందిగామలో వైయస్ఆర్సీపీ నేత బొగ్గవరపు వాసు హత్య
గుంటూరు: పల్నాడు వైయస్ఆర్సీపీ నేత కుమారుడు సాంబయ్య హత్య
(2016 డిసెంబర్ 9) పులివెందుల : వేంపల్లి మండలం ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి హత్య
(2017 మే 6) కర్నూలు : ఆళ్ళగడ్డ నియొజకవర్గం గోవిందపల్లిలో వైయస్ఆర్సీపీ నేత ఇందూరి ప్రభాకర్ రెడ్డి ఆయన బావమరిది దారుణ హత్య
(2017 మే 21) కర్నూలు : పత్తికొండ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు దారుణ హత్య