<br/>నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మట్టెంపాడుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్కు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. యువకులు ఎదురెళ్లి జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్కు వివరించారు.